తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి గ్రామం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనతో జనసంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు హాజరుకావడంతో దేవరపల్లి పొగాకు రైతులు, ప్రజలతో సందడిగా మారింది.