కాకినాడ: శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయానికి భూమి దానం

కాకినాడలో వేంచేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అరెకరం భూమిని కాకినాడ చెందిన దంపతులురెడ్డి ఆదిమూర్తి, అనురాధలు దానం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం శ్రీ బాలా త్రిపుర సుందరాలయంలో దాత రెడ్డి ఆదిమూర్తి దంపతులు భూమి విరాళాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్