కాకినాడ నుండి హైదరాబాదుకు ప్రత్యేక రైళ్లు

దసరా పండగ రద్దీని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ టౌన్-సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికా రులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్ నుంచి ఈనెల 8, 10, 12 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8. 30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. రైలుకు సంబంధించిన రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్