పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా తోట సుధీర్

రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ ను ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు సీఎస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాకినాడ లో మంగళవారం తోట సుధీర్ ఇంటి వద్ద సందడి నెలకొంది. జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆయన గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅక్రమ బియ్యం వ్యాపారంపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్