పేదవానికి మద్యం షాపులు అందని ద్రాక్షే

నూతన మద్యం పాలసీ విధానం ధనవంతులకు వరంగా మారింది. మద్యం షాపుకు దరఖాస్తు చేయాలంటే ముందస్తుగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ తిరిగి వస్తే పరవాలేదు కానీ నూతన విధానంలో డబ్బులు వెనక్కు రాని పరిస్థితి. దీంతో పెట్టుబడి పెట్టేందుకు పేద, మధ్యతరగతి వారు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు కొత్తపేట ఎక్సైజ్ శాఖ పరిధిలో గురువారం నాటికి సుమారుగా 500 పైబడి అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్