కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ T. V. రామారావు, పలు ఆరోపణల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ నియోజకవర్గంలో పర్యటించి, క్షేత్రస్థాయి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం, జనసేన పార్టీ అధిష్టానం శనివారం T. V. రామారావును కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జిగా పునర్నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.