ఈ నెల 30న నిడదవోలు పట్టణంలో బంద్

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి జన్మభూమి ఎక్స్ప్రెస్ కు అనపర్తిలో హాల్ట్ ఇప్పించి, నిడదవోలు నియోజకవర్గం పట్ల పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఎంపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 30న నిడదవోలు పట్టణం బంద్ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్