తూ.గో: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో కోడి పందేల బరి వద్ద బుధవారం జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కాగుతున్న నూనె ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమ్మిశెట్టి గంగాధర్ అనే యువకుడు గుండాట వద్ద గెలుచుకున్న రూ. 200 కోసం ఘర్షణ పడ్డాడు. ఆవేశంతో బైకులోని పెట్రోల్ పోసుకుని నిప్పంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్