ఇండియన్ ఆయిల్ బంకులో అధికారుల తనిఖీలు

సామర్లకోట - కాకినాడ రోడ్డులో ఇండియన్ ఆయిల్ బంకులో సోమవారం రాత్రి అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులతో పాటు, ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఉప్పలంక జంక్షన్ వద్ద యానాం నుండి అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ పట్టుకున్న కేసులో ఈ బంకు యజమాని ముద్దాయి కావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు విజిలెన్స్ డీఎస్పీ ఎస్. తాతారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్