పెద్దాపురం డిఎస్పీగా శ్రీహరిరాజు బాధ్యతలు స్వీకరణ

కాకినాడజిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ డిఎస్పీగా శ్రీహరిరాజు ఆదివారం బాధ్యత చేపట్టారు. ఇప్పటివరకు సేవలందించిన లతా కుమారి విజయవాడకు బదిలీ కావడంతో రాష్ట్రప్రభుత్వం నూతన డిఎస్పీగా శ్రీహరిరాజును నియమించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన బాధ్యత చేపట్టారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. డివిజన్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఆయనకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్