పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పనున్న పవన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా అమరావతి నుంచి మధ్యాహ్నం 3. 45 గంటలకు చిత్రాడ సభా ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్లో దిగనున్నారు. సభా వేదికకు 500మీటర్ల దూరంలోనే హెలిప్యాడ్ ను నిర్మించారు. ఈ సభలో పవన్ దాదాపు రెండు గంటలకుపైగా ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థాంక్యూ పిఠాపురం చెప్పుకుందాం అనే నినాదంతో ఈ సభ జరగనున్నది.

సంబంధిత పోస్ట్