రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న చినజోగిరాజు (53) అనారోగ్యంతో మృతి చెందాడు. కాకినాడ జిల్లా శంఖవరానికి చెందిన ఇతను 2008 నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెలలో జైలులో పనిచేస్తుండగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆదివారం ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.