రాజమండ్రి: ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభల కరపత్రాలను సోమవారం రాజమండ్రి సిపిఐ జిల్లా కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతను అన్ని రకాలుగా మోసం చేస్తున్న పాలకులపై ఉద్యమించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, శ్రీనివాస్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్