రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం 2, 3 మధ్య ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్‌పీ సీఐ YV రమణ తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలూ లభించలేదు. సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉన్న ఈ వ్యక్తి నీలం, తెలుపు రంగు టీషర్ట్, ఎరుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిస్తే స్థానిక జీఆర్‌పీ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్