రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన, రాష్ట్ర అభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న వ్యక్తిగత సహాయాన్ని చూసి ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం కె. గంగవరం గ్రామ సర్పంచ్ కోటి లక్ష్మీనరసమ్మ వెంకట్రావుతో పాటు మరో 26 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.