గాంధీజీ చేసిన పోరాటం అజరామరం: ఎమ్మెల్యే దేవ

దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన పోరాటం అజరామరమైనదని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మలికిపురం సెంటర్లోని విగ్రహానికి బుధవారం ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీతో పాటు ఎంతోమంది యోధుల పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే వరప్రసాద్ సూచించారు.

సంబంధిత పోస్ట్