అప్పనపల్లి నూతన ఈవోగా సత్యనారాయణ రాజు

మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎం. సత్యనారాయణ రాజు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అయినవిల్లి ఈవోగా పని చేస్తున్నారు. అప్పనపల్లి ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈవోగా ఛార్జ్ తీసుకున్న ఆయనకు ఆలయ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. సమిష్టిగా పనిచేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకుని వస్తానని ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్