యధేచ్చగా మట్టి అక్రమ రవాణా జరుగుతుండగా,శనివారం మూడు టాక్టర్లు, జెసిబిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండామట్టి తరలిస్తున్న మూడు టాక్టర్లు, జె. సి. బి. లను స్థానిక పోలీసులు సీజ్ రెవిన్యూ అధికారులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.