జగ్గయ్యపేట: తూతూ మంత్రంగానే అధికారుల చర్యలు

పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల అధికారులు అప్రమత్తమై నదిలో పడవలను నిలిపివేశారు. అయితే, పది రోజులు గడవకముందే పడవ నిర్వాహకులు యథావిధిగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రమాదాలు జరిగినప్పుడే తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్