కంచికచర్ల: విషాదం.. 7ఏళ్ల బాలుడు మృతి

కంచికచర్లలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అరుంధతి కాలనీకి చెందిన వినయ్ అనే (7) బాలుడు నిన్నటి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాలుడు వినయ్ డాబా పైన ఉన్న బియ్యం డబ్బాలో మృతి చెంది ఉండటం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. డాబాపై ఆడుకుంటూ డబ్బాలో దాక్కొని ఉండగా మూతపడి ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత పోస్ట్