పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు సందర్భంగా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ జగదాంబ సోమేశ్వర స్వామి ఆలయంలో గాయత్రి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంబాభిషేకంతో స్వాగతం పలికారు.