విసన్నపేటలో కేబుల్ దొంగలు కదలికలు

విస్సన్నపేట పట్టణంలోని నూజివీడు రోడ్ లో మామిడి తోటలో ఉన్న రైతుల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించి కేబుల్ వైర్ ను దుండగులు బుధవారం రాత్రి కట్ చేశారు. బాధిత రైతులు పొలాలకు వెళ్లి చూడగా కేబుల్ వైరు కట్టయ్యి కనిపించింది. ఇదే సందర్భంలో విద్యుత్ బోర్డులో ఉన్న ఫీజులను తొలగించి చోరీకి సిద్ధమైనట్లు పలువురు రైతులు తెలిపారు. పట్టణంలోని ఇటువంటి చిల్లర దొంగతనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్