హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 4, 300 మందితో కూడిన కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విజయవాడకు చెందిన 14 ఏళ్ల నృత్యకారిణి ప్రణీతారెడ్డిని ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం అభినందించారు.