పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 1, 62, 000 చెక్కును విజయవాడ 50వ డివిజన్ కి చెందిన జె. సరస్వతికి అందజేశారు.