అవనిగడ్డ: గుజరాత్ గడ్డపై మార్మోగిన తెలుగువాణి*

గుజరాత్ లోని సూరత్ నగరంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. 1975లో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి, దేశవ్యాప్తంగా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావును స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్