చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనకు ఉల్లిపాయ బాంబులే కారణమని ఏలూరు రేంజ్ ఐజిపి జివిజి. అశోక్ కుమార్ తెలిపారు. ఆయన పోలీస్ స్టేషన్ ను సందర్శించి, ప్రమాద వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో మూడు కేసుల్లో సీజ్ చేసిన దీపావళి మందుగుండు సామాగ్రిని కోర్టు ఆదేశాలతో నిర్మూలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.