చల్లపల్లి: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15వ తేదీ నుంచీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. చల్లపల్లిలో 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమాన్ని శనివారం స్థానిక పడమరవీధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించగా బాగుందని మహిళలు సంతోషంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్