కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో యలవర్తి సూరిబాబుకు చెందిన లక్ష రూపాయల విలువైన గేదె మృతి చెందింది. వి. కొత్తపాలెం-జయపురం గ్రామాల మధ్య వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు గేదెను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ చాణక్య ఘటనాస్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.