కోడూరు మండలంలోని హంసలదీవిలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తజనసంద్రం నెలకొంది. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో సాగర తీరం భక్తులతో కిటకిటలాడింది.