కోడూరు మండలంలోని తుంగపల్లెమ్మ గుడి సమీపంలో మినుము పంట పొలాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందలాది కోతులు పొలాల్లోకి చొరబడి మినుము మొక్కలను పీకివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులతో అల్లాడుతున్న రైతులకు ఈ కోతుల దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.