మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదానం పథకమునకు తిరువూరు వాస్తవ్యులు నల్ల వెంకట సత్యనారాయణ రావు, సీతా కుమారి దంపతులు రూ. 1,00,116లు చెక్ ద్వారా ఆలయ పర్యవేక్షకులు అచ్యుత మధుసూదన్ కి అందజేసారు. గురువారం వారు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ ఉద్యోగులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.