మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక్కరోజు ఆదాయం పది లక్షలు వచ్చినట్టు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. సోమవారం ఉదయం దేవస్థానంలో ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆది, మంగళవారాలలో భక్తులు అధికంగా ఆలయానికి విచ్చేస్తారని తెలిపారు. నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.