ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ మంగళవారం మోపిదేవి మండలం రావివారిపాలెం, వెంకటాపురం, మోపిదేవిల్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. రావివారిపాలెంలో రైస్ మిల్లు వద్ద రైతులతో, మిల్లర్తో మాట్లాడి కొనుగోళ్లను పర్యవేక్షించారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.