గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక గొప్ప వరమని, ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన ఇరువురు లబ్ధిదారులకు ఎల్. ఓ. సి పత్రాలను అందజేశారు. బాపులపాడు మండలం మడిచర్ల గ్రామానికి చెందిన జువ్వనపూడి ఆరోగ్యమ్మకు రూ. 76, 802 చెక్కును అందించారు.