మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 105 కోట్ల వ్యయంతో చేపట్టిన మూడు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులకు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యాక విజయవాడ, తిరుపతి నగరాలను ‘గ్రేటర్’ నగరాలుగా ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. విజయవాడ రూరల్ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే కోరారు.