గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ‘ఆంధ్రప్రదేశ్ భూ క్రమబద్ధీకరణ పథకం-2025’ కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. వెదురుపావులూరు గ్రామానికి చెందిన 19 మంది, వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన 52 మంది మొత్తం 71 మందికి పట్టాలు అందజేశారు.