గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీ గూడెం గ్రామం హరిజనవాడలో పేకాట స్థావరంపై గన్నవరం ఎస్ఐ ప్రశాంతి తన సిబ్బందితో మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రశాంతి హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.