గన్నవరం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురుకి గాయాలు

గన్నవరంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. విద్యానగర్ స్టేట్ బ్యాంక్ వద్ద ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్