ఆదివారం గన్నవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టు జర్నలిస్టు అసోసియేషన్ కృష్ణాజిల్లా కమిటీల 4వ మహాసభల్లో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి రక్షణే ధ్యేయంగా సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలు రోటరీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.