గుడివాడ: బిసివై యూత్ కన్వీనర్‌గా బోయిన బిక్షం

భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా బోయిన బిక్షంను నియమించారు. పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, బిక్షం పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని గుర్తించి ఈ పదవిని కేటాయించారు. ఈ నియామకంపై బిక్షం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గుడివాడలో పార్టీని యువతకు మరింత చేరువ చేసి, వారి సమస్యలపై పోరాడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్