గుడివాడ: బ్యానర్ చింపేశారని జనసేన నేతల నిరసన

గుడివాడలో టిడ్కో కాలనీ ఇంచార్జ్ నిరంజన్ జనసేన యువ నేత బ్యానర్ చించివేశారని ఆరోపిస్తూ, జనసేన శ్రేణులు మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. "జై జనసేన జై జై జనసేన" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శ్రీనాథ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్