తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెచప్పుడు అని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంటి పండుగ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆదివారం గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ స్టేడియం వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు.