ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ను 'అబద్దాల కోర' అని అభివర్ణించిన అచ్చెన్నాయుడు, ఆయన గురించి మాట్లాడటానికే అసహ్యంగా ఉందని అన్నారు. గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా పామర్రు, వెంట్రప్రగడలో మొంథా తుపాన్ అనంతరం పంటల బీమాపై వైసీపీ టెలి కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.