జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మరియు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్లో ఈ అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు.