మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే అమరావతిలో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించారని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ నాయకులకు ఇప్పుడు అక్కడ పర్యటించే అర్హత లేదని అన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నాయకులు బహిరంగంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని మంత్రి విమర్శించారు.