01 ఫిబ్రవరి, 2026 ఆదివారం మాఘ పూర్ణిమ సందర్భంగా మచిలీపట్నం బీచ్కు వేలాది మంది భక్తులు తరలివచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు. పుణ్యస్నానాల కోసం వచ్చిన ప్రజలకు అధికారులు త్రాగునీరు, వైద్య సేవలు వంటి సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అపాయాలు, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. భక్తుల సమన్వయంతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.