ఇబ్రహీంపట్నంలో తెగిపోయిన కరెంట్ తీగలు

తుఫాను నేపథ్యంలో వీచిన బలమైన గాలుల వల్ల ఇబ్రహీంపట్నం మండలంలో కరెంటు తీగలు తెగిపోయాయి. దీనితో పాత గేటు సమీపంలోని ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది. తెగిన తీగల వల్ల ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్