ఎగువ తెలంగాణ నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఐ అర్జున్, తహశీల్దార్ శాంతిలక్ష్మీ బ్రిడ్జి వద్ద రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.