శనివారం జి. కొండూరు మండలం గంగినేనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సొసైటీలో పనిచేస్తున్న కృష్ణారావు (50) అనే వ్యక్తి విద్యుత్ తీగలను సరిచేయడానికి స్తంభం ఎక్కగా కరెంట్ షాక్తో మృతి చెందాడు. దుగ్గిరాల గ్రామానికి చెందిన కృష్ణారావు కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఒక పాప, బాబు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.