ఇబ్రహీంపట్నం: ఇంధనం కొరతపై వైసిపి నినాదాలు

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద మంగళవారం వైసిపి నాయకులు ఆందోళన చేపట్టారు. డీజిల్, పెట్రోల్ కొరతతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంధన సమస్యను పరిష్కరించాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్